Monday, May 20, 2024

యూనివర్సిటీ క్యాంపస్‌లో 8 ఏళ్ల కుమార్తె గొంతు కోసి చంపిన ప్రొఫెసర్.!

spot_img

హర్యానాలోని హిసార్ జిల్లాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం సాయంత్రం, యూనివర్సిటీ క్యాంపస్‌లోని కార్యాలయంలో ఒక ప్రొఫెసర్, అతని 8 ఏళ్ల కుమార్తె మృతదేహాలు కనిపించడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు హిసార్‌లోని లాలా లజ్‌పత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్‌లో పనిచేస్తున్న సందీప్ గోయల్ (35)గా గుర్తించారు.గోయల్, అతని కుటుంబం యూనివర్సిటీ క్యాంపస్‌లో నివసిస్తున్నారు. మృతులు గొంతు కోసిన స్థితిలో కనిపించారని, గోయల్ కార్యాలయం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డిప్రెషన్‌తో గోయల్‌ చికిత్స పొందుతున్నాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. అన్ని కోణాల్లోనూ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..ప్రొఫెసర్ తన కుమార్తె గొంతు కోసి, ఆపై సర్జికల్ బ్లేడ్‌తో తన గొంతును కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ప్రొఫెసర్ వాస్తవానికి నర్వానా నివాసి. అతని భార్య నీతూ గోయల్,కుమార్తెతో కలిసి లువాస్‌లోని ప్రభుత్వ క్వార్టర్‌లో ఉంటున్నారు. సాయంత్రం తన కూతురును వాకింగ్ కు తీసుకెళ్తానని చెప్పి ఇంటి నుంచి వచ్చారు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో భార్య అన్ని చోట్లా వెతికింది.యూనివర్సిటీ క్యాంపస్‌లోని తన కార్యాలయంలో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. ప్రొఫెసర్ తన కుమార్తెను దారుణంగా హత్య చేశాడు. సర్జికల్ బ్లేడుతో కడుపు ను కోసి పేగులను బయటకు తీశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: రంజాన్ పవిత్రమాసం ప్రారంభం..భారత్ లో ఆ రోజు నుంచి ఉపవాసం..!

Latest News

More Articles