Saturday, May 18, 2024

హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో లక్ష వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ

spot_img

పర్యావరణ హితం కోసం గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నది. అందులో భాగంగా ప్రతి ఏటా లక్ష మట్టి వినాయక ప్రతిమలను హెచ్ఎండిఏ ఉచితంగా పంపిణీ చేస్తున్నది. ఈ ఏడాదికి సంబంధించిన లక్ష వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని పురపాలక శాఖ మంత్రివర్యులు కే.టీ. రామారావు, మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులతో కలిసి ప్రారంభించారు.

Also Read: మంచి రాజ‌కీయ నాయ‌కుల వ‌ల్లే మంచి అభివృద్ధి సాధ్యం

ఈ కార్యక్రమంలో ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రభాకర్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీమతి పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎండిఏ కమిషనర్ అర్వింద్ కుమార్ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వినాయక మట్టి ప్రతిమను అందజేశారు. గురువారం 14వ తేదీ నుండి వరుసగా నాలుగు రోజులపాటు 17వ తేదీ వరకు జంట నగరాలలోని 40 కేంద్రాలలో హెచ్ఎండిఏ వినాయక మట్టి ప్రతిమలను హెచ్ఎండిఏ యంత్రాంగం ఉచితం పంపిణీ చేయనుంది.

Latest News

More Articles