Sunday, May 19, 2024

దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ – 1 : మహమూద్ అలీ

spot_img

ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందంజలో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ మహమూద్ అలీ అన్నారు. రంగారెడ్డి జిల్లా లోని రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో మైలార్‌దేవ్‌పల్లి టౌన్ లో నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని ఈ రోజు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్, చేవెళ్ళ ఎంపీ డా.రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ 1 అని ప్రశంసించారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ… తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సహకారంతో సుమారు 2ఎకరాల సువిశాలమైన స్థలంలో, రూ.4.5 కోట్ల వ్యయంతో మైలార్‌దేవ్‌పల్లి లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ, శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ ముందు స్థాయిలో ఉందని కితాబు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు లా & ఆర్డర్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు’ మహమూద్ అలీ.

Latest News

More Articles