హైదరాబాద్: శాంతిభద్రతల అంశంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా టీనాబ్ ఆధ్వర్యంలో శౌర్య కన్వెన్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉందని, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేయొద్దని కోరారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా, తాము ఎంచుకున్న రంగంలో అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ కృతిశెట్టి, డీజీపీ అంజనీకుమార్, టీ నాబ్ సంచాలకులు సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.