Sunday, May 19, 2024

మైనంపల్లికి షాక్.. పద్మాదేవేందర్ రెడ్డికి పట్టం

spot_img

మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరాక.. ఆ పార్టీలో ఏళ్ల తరబడి ఉన్న లీడర్లు తిరుగుబాటు చేస్తూ గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు. తన కొడుకును మెదక్ లో గెలిపించాలని తహతహలాడుతున్న మైనంపల్లికి షాక్ ఇస్తూ.. కనీసం డిపాజిట్ కూడా వస్తుందో రాదోనన్న పరిస్థితి ఎదురవుతోంది. గురువారం చిన్న శంకరంపేట మండలం వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ తో పాటు అనేకమంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సంర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని గత పది సంవత్సరాలుగా కష్టపడుతూ క్యాడర్ ను కాపాడుకుంటే.. కష్టపడిన కార్యకర్తలకు కాకుండా పారాషూట్ నాయకులకు డబ్బులకు టికెట్లు అమ్ము కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడ్డ కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందనే మనస్థాపనతో రాజీనామా చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో నిఖార్సైన కార్యకర్త ఎవరు లేరు. అంతా రాజీనామాలతో బయటకు వచ్చారని తెలిపారు. ఇప్పుడు ఉంటుంది మాత్రం పారాషూట్‌ నాయకులు ఇచ్చే డబ్బులకు ఆశపడ్డ వాళ్లు మాత్రమే ఉంటున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డికి పట్టం కడుతూ.. భారీ మెజార్టీతో గెలిపించి తీరుతామని స్పస్టం చేశారు.

Latest News

More Articles