ఇండోనేషియాలోని బాలి సాగర్ ప్రాంతం ఈరోజు తెల్లవారుజామున సంభవించిన బలమైన భూకంపంతో వణికిపోయింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7గా నమోదైంది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఇండోనేషియాలోని బాలి సాగర్ ప్రాంతంలో 7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) నివేదించింది. ఇండోనేషియాలోని మాతరానికి ఉత్తరాన 201 కి.మీ, భూ ఉపరితలం నుంచి 518 కి.మీ దిగువన భూకంప కేంద్రం ఉన్నట్లు EMSC నివేదించింది.
A magnitude 7.0 earthquake struck the Bali Sea region of Indonesia today, reports Reuters quoting European-Mediterranean Seismological Centre (EMSC)
— ANI (@ANI) August 28, 2023
భూకంపం దృష్ట్యా ఇండోనేషియా చాలా సున్నితమైన ప్రాంతం. గతేడాది నవంబర్లో ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రావిన్స్లో సంభవించిన భూకంపం వల్ల 300 మంది మరణించగా, వేలాది మంది గాయపడ్డారు. ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది.