Sunday, May 12, 2024

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌.. 4 మావోయిస్టు అగ్రనేతలు మృతి.!

spot_img

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని రేపన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన 4 మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. వారిని మంచిర్యాల డివిజన్ కమిటీ చెందిన సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి మగ్తూ, ప్లాటూన్ సభ్యులు కుర్సంగ్ రాజు, కుడిమెట్ల వెంకటేశ్ గా గుర్తించారు.

ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక ఏకే-47 తుపాకీ, ఒక కార్బైన్, రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్, నక్సల్ సాహిత్యం, ఇతర వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. మరణించిన వారిలో ఇద్దరిపై పోలీసుల శాఖ గతంలో భారీ రివార్డును కూడా ప్రకటించింది. వారిపై రూ. 36లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: వంట త్వరగా చేయలేదని భార్యను చంపి..

Latest News

More Articles