Wednesday, May 22, 2024

అనుమానంతో భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య..అనాథలైన చిన్నారులు..!!

spot_img

అనుమానం భార్యభర్తల చావుకు కారణమైంది. పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. ఇద్దరు పిల్లలను అనాథలుగా మార్చింది. ఓ వ్యక్తి భార్యను హత్య చేసిన తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడియం మండలం కడియపుసారంలో చోటుచేసుకుంది. దక్షిణమండల డీఎస్సీ అంబికాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..కడియపుసావరం వడ్డి వీరభద్రరావునగర్ కు చెందిన దూళ్ల సూరిబాబు తో అదే గ్రామానికి చెందిన సత్యశ్రీకి 16ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పాప, బాబు ఉన్నారు.

సూరిబాబు కౌలురైతుగా జీవనం కొసాగిస్తున్నాడు. మనస్పర్థల కారణంగా 8నెలల క్రితం పిల్లలతో సత్యశ్రీ పుట్టింటింకి వెళ్లింది. సంక్రాంతి పండగ నుంచి విభేదాలు పెరిగిపోయాయి. సత్యశ్రీ ఇతరులతో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందని అత్తవారికి సూరిబాబు చెప్పాడు. వారు సర్థిచెప్పి కాపురానికి పంపించారు. ఈనెల 14వ తేదీన మరోసారి పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చింది. అక్కడ గొడవ జరగడంతో సూరిబాబు పిల్లలను తీసుకుని తన ఇంటికి వచ్చేశాడు. కాపురానికి రమ్మని మరోసారి అడిగేందుకు గురువారం ఉదయం 6గంటల ఆమె దగ్గరకు వెళ్లాడు. గొడవ జరిగింది. భార్యను గొంతు కోసి చంపాడు. రక్తపు మడుగులో విగతజీవిగా ఉన్న సత్యశ్రీని చూసి తల్లిదండ్రులు బోరుమన్నారు.

భార్యను చంపి సూరిబాబు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ భూముల్లో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనతో కడియంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు.

ఇది కూడా చదవండి: నేడు భారత్ బంద్- ఇంటర్నెట్ బ్యాన్ పొడగింపు..!!

Latest News

More Articles