భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్యయత్నం చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అడ్డగూడూరుకు చెందిన మనోహర్ గత నెల 17వ తేదీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వధువు భూమికను, మనోహర్ ను తల్లిదండ్రులు వేధిస్తూనే ఉన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భూమిక..ఈనెల 6వ తేదీని ఆత్మహత్యకు యత్నించింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించింది. భార్య మరణించిందని తెలుసుకున్న మనోహర్ తీవ్ర మనోవేదన చెందాడు. అతను కూడా ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతన్ని తిరుమలగిరి ఆసుపత్రికి తరలించారు. కాగా అత్తింటి వేధింపులతోనే భూమిక సూసైడ్ చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ప్రేమించి పెళ్లి చేసుకుని నెలరోజులుకూడా గడవకముందే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం కంటతడి పెట్టించింది.
ఇది కూడా చదవండి:సుమత్రా ద్వీపంలో కుండపోత వర్షం..19 మంది మృతి.!