Sunday, May 12, 2024

భార్య కాపురానికి రావట్లేదని కరపత్రాలలో ఏం రాసి పంచాడో తెలుసా?

spot_img

వారిద్దరూ బంధుమిత్రుల సమక్షంలో అంగరంగవైభవంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు సజావుగా సాగిన వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. దాంతో ఆ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే భార్య కాపురానికి రావడంలేదని ఆ భర్త ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Read Also: ముగిసిన ఏషియన్ గేమ్స్.. 107 పతకాలతో నాలుగో స్థానంలో భారత్

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రానికి చెందిన తేజావత్‌ జంపన్న, తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే ఏవో మనస్పర్థల వల్ల దంపతుల మధ్య గొడవలు జరిగాయి. మనస్థాపం చెందని భార్య.. భర్త మీద కోపంతో పుట్టింటికి వెళ్లిపోయి, అక్కడే తల్లిదండ్రులతో ఉంటోంది. జంపన్న ఎన్నిసార్లు అడిగినా.. ఆమె కాపురానికి రావడం లేదు. దాంతో విసిగిపోయిన జంపన్న.. మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు దిగాడు. తన భార్య కాపురానికి రాకపోవడానికి ఆమె తరఫు బంధువులైన మంగ్యా, తిరుపతి, గణేశ్‌ కారకులని భావించాడు. ఈ ముగ్గురి పేర్లతో పాటు భార్య పేరు రాసి శనివారం అర్ధరాత్రి అత్తింటి ముందు మావోయిస్టు పేరుతో నకిలీ కరపత్రాలను వదిలాడు. ‘జంపన్న భార్యను వెంటనే కాపురానికి పంపండి.. లేకపోతే చంపేస్తాం..’ అని దానిలో రాసి ఉంది. అయితే జంపన్నే ఈ పని చేసి ఉంటాడని భావించి అత్తింటి వారు టేకులపల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం హైజాక్!

Latest News

More Articles