కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం హైజాక్ చేయబోతున్నాం అని వచ్చిన వార్తతో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వార్త విన్న అధికారులు భద్రతను మరింత పటిష్ఠం చేసి, హైఅలర్ట్ విధించారు. అంతేకాకుండా పోలీసులతో ఎయిర్ పోర్టులో తనిఖీలను ముమ్మరం చేశారు.
Read Also: ఈ రోజే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్
కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్లు అధికారులకు బెదిరింపు మెయిల్ వచ్చింది. అగంతకుడు చేసిన మెయిల్ చూసిన ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది వెంటనే దుబాయ్ వెళ్లే విమానాన్ని ఆపి క్షుణ్నంగా తనిఖీలు చేశారు. అంతేకాకుండా ఎయిర్ పోర్ట్లో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై టెక్నికల్ సిబ్బంది ఆరా తీసేపనిలో పడ్డారు.
Read Also: జెట్ స్పీడులో మంత్రి కేటీఆర్.. నేడు నాలుగు జిల్లాల్లో పర్యటన
కాగా.. అధికారుల హడావుడి చూసి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. విమానాశ్రయంలో పార్కింగ్, డిపాశ్చర్, ఆగమనాలు విభాగాల్లో సీఐఎస్ఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్తో తనిఖీలు మొదలు పెట్టారు. ఏం జరుగుతుందో అర్థంకాక నిశ్చేస్టులై నిలబడిపోయారు. అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
Read Also: సీఎం కేసీఆర్ గుడ్న్యూస్.. నగదు రహిత చికిత్స కోసం ట్రస్ట్