Tuesday, May 21, 2024

మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిపై తప్పుడు ప్రచారం సరికాదు..!

spot_img

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తూ ఓట్లు అడగడం ఏమాత్రం సరికాదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. బీజేపీ అబ్యర్థి రఘునందన్ రావు తప్పుడు మాటలు మానుకుంటే బాగుంటుందని హితవు పలికారు. సిద్ధిపేటలో వెంకట్రామిరెడ్డితో కలిసి హరీశ్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హారీశ్ మాట్లాడుతూ..మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పై బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తుందంటూ ఫైర్ అయ్యారు.

గతలో దుబ్బాక నుంచి నకిలీ వీడియోలు చేసి వదిలారంటూ మండిపడ్డారు.బీజేపీ అబద్ధాలు విని, వీడియోలు చూసి ప్రజలు మోసపోవద్దని హరీశ్ రావు సూచించారు. ప్రజలకు సేవ చేసేందుకే వెంకట్రామిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఆయన మచ్చలేని మనిషి అన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ దుబ్బాకలో బీజేపీ తప్పుడు ప్రచారం చేసి గెలించదని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో కలకలం..పలు స్కూళ్లు బాంబు బెదిరింపులు.!

Latest News

More Articles