Saturday, May 18, 2024

న్యూ ఇయర్ కోసం నగరానికి డ్రగ్స్.. గ్రాము రూ.2 వేలకు కొని రూ.7వేలకు అమ్మకం

spot_img

కొత్త సంవత్సరం దగ్గర పడుతున్నా కొద్దీ నగరంలో డ్రగ్ పెడ్లర్లు రెచ్చిపోతున్నారు. న్యూ ఇయర్ వేడుకలను టార్గెట్ చేసుకొని పెద్దమొత్తంలో నగరానికి డ్రగ్స్ తీసుకొస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కు తీసుకొస్తున్న ఎండీఎంఏ డ్రగ్స్‎ను సెంట్రల్ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలను తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శరత్ పవార్ తెలిపారు. వీరు న్యూ ఇయర్ కోసం మహారాష్ట్ర నుంచి డ్రగ్స్ తీసుకొస్తుండగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వీరి నుంచి ఏడు లక్షల విలువైన 100 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కొత్త సంవత్సర వేడుకలే టార్గెట్‎గా ఈ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు.

రూ.2వేలకు ఒక గ్రాము కొని.. హైదరాబాద్‎లో రూ. 7 వేలకు అమ్ముతున్నట్లు తెలిసింది. నిందితులు మహారాష్ట్రలో నైజీరియన్ జ్యో నుండి వీటిని కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నారు. పరారీలో ఉన్న జ్యో కోసం గాలిస్తున్నామని డీసీపీ శరత్ చెప్పారు. నూతన సంవత్సరం వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని.. డ్రగ్స్ అమ్మే వారిపై, కొనే వారిపై కూడా పోలీసుల నిఘా ఉందని ఆయన హెచ్చరించారు.

Read Also: విద్య ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం

Latest News

More Articles