హైదరాబాద్: వినాయక నిమజ్జనం ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. మరోవైపు నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు.
Also Read.. 19 కిలోమీటర్ల శోభాయాత్ర.. 25694 మంది పోలీసులు.. వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం
బాలాపూర్ గణేష్ మొదలుకుని హుస్సేన్ సాగర్ వరకు 19 కిలో మీటర్ల శోభాయాత్ర కొనసాగనుంది. ప్రతి విగ్రహానికి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ లు సిద్ధం చేశారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లోకి సాధారణ వాహనాలు రాకుండా ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
More News…