Tuesday, May 21, 2024

నుమాయిష్ 2022: అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో సర్వీసులు

spot_img

హైదరాబాద్: నాంప‌ల్లి నుమాయిష్ 2022 సంద‌ర్భంగా మెట్రో రైలు వేళ‌ల స‌మ‌యాన్ని పొడిగించారు. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ వ‌ర‌కు అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

ఎల్బీన‌గ‌ర్ – మియాపూర్, నాగోల్ – రాయ‌దుర్గం మార్గాల్లో మెట్రో స‌మ‌యాలను పొడిగించారు. అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌కు చివ‌రి మెట్రో రైళ్లు ప్రారంభం కానున్నాయి.

నాంపల్లి ఎగ్జిబిషన్ నేపథ్యంలో గాంధీ భ‌వ‌న్ మెట్రో స్టేష‌న్‌లో టికెట్ బుకింగ్ కౌంట‌ర్ల సంఖ్య‌ను పెంచ‌నున్న‌ట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు.

Latest News

More Articles