హైదరాబాద్: నాంపల్లి నుమాయిష్ 2022 సందర్భంగా మెట్రో రైలు వేళల సమయాన్ని పొడిగించారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో మెట్రో సమయాలను పొడిగించారు. అర్ధరాత్రి 12 గంటలకు చివరి మెట్రో రైళ్లు ప్రారంభం కానున్నాయి.
నాంపల్లి ఎగ్జిబిషన్ నేపథ్యంలో గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో టికెట్ బుకింగ్ కౌంటర్ల సంఖ్యను పెంచనున్నట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు.