Monday, May 13, 2024

ఓయూలో ఇండియా స్టార్టప్‌ ఫెస్ట్‌ – 24

spot_img

హైదరాబాద్: ఫిబ్రవరి-2024లో నిర్వహించే ఇండిమా స్టార్టప్‌ ఫెస్ట్‌ – 24కు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కానుంది. ఫెస్ట్ కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఓయూ అధికారులు శుక్రవారం ఆవిష్కరించారు. విద్యార్థులను ప్రోత్సహించి, సరైన వాతావరణం నెలకొల్పేందుకు ఇండియా స్టార్టప్‌ ఫౌండేషన్‌ (ఐఎస్‌ఎఫ్‌), ఉస్మానియా ఫౌండేషన్‌ (ఓఎఫ్‌) చేతులు కలిపాయని ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ చెప్పారు. ఈ ఫెస్ట్‌లో దేశంలోని ప్రముఖ వక్తలు, పారిశ్రామికవేత్తలు, పెట్టబడిదారులు ఒకే వేదికపైకి వస్తారని వివరించారు.

Latest News

More Articles