Sunday, April 28, 2024

పోలీసు అధికారిగా ఏడేళ్ల బాలుడు

spot_img

హైదరాబాద్‌: క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడి కోరికను బంజారాహిల్స్‌ పోలీసులు తీర్చారు. గుంటూరుకు చెందిన మోహన్ సాయి గతేడాది క్యాన్సర్ బారిన పడ్డాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ చిన్నారికి పోలీసు కావాలనే కోరిక ఉందని ఆస్పత్రి సిబ్బంది తెలుసుకుని ‘మేక్ ఎ విష్’ ఫౌండేషన్ సభ్యులను సంప్రదించారు.

పోలీసు అధికారి కావాలనే ఆ బాలుడు కోరికను మేక్‌ ఎ విష్‌ ఫౌండేషన్‌ ద్వారా తెలుసుకున్న పోలీసులు.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో బాలుడికి స్వాగతం పలికి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో జరిగే పని విధానం గురించి వివరించి బహుమతులను అందజేశారు.

Latest News

More Articles