Friday, May 17, 2024

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన భారత క్రికెటర్లు

spot_img

ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో టీమిండియా సత్తాచాటింది. 116 పాయింట్లతో భారత్‌ మూడోస్థానంలో ఉండగా.. 118 పాయింట్లతో ఆస్ట్రేలియా, పాక్‌ తొలి రెండుస్థానాల్లో నిలిచాయి. ఆసియా కప్‌లో రాణించిన శుభ్‌మన్‌ గిల్‌ కెరీర్‌లోనే తొలిసారిగా రెండో ర్యాకింగ్స్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం 863 పాయింట్లతో టాప్‌-1లో ప్లేస్‌లో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ ఉండగా.. 759 పరుగులతో శుభ్‌మన్‌ గిల్‌ రెండో స్థానంలో నిలిచాడు.

ఇది కూడా చదవండి.. భార్య సవరం, డ్రెస్ ధరించి గుట్టుచప్పుడు కాకుండా దొంగతనం..!

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ సైతం రెండేసి స్థానాలు మెరుగుపరుచుకొని టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. 715 పాయింట్లతో విరాట్‌ 8వ స్థానంలో, 707 పాయింట్లతో రోహిత్‌ శర్మ 9వ స్థానంలో ఉన్నారు. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారిగా ముగ్గురు భారత బ్యాటర్లు ఐసీసీ ర్యాకింగ్స్‌లో టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. ఇక ఇక ఆల్‌రౌండర్స్‌ ర్యాంకింగ్స్‌లో హార్దిక్‌ ప్యాండ్యా నాలుగు స్థానాలు మెరుగుపరుచుకొని ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇది కూడా చదవండి.. సోనియా, రాహుల్ లకు కవిత సవాల్.. సమాధానం చెప్పాకే తెలంగాణలో అడుగు పెట్టాలి..!!

ఆసియాకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల పడగొట్టిన స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ ఐదు స్థానాలు మెరుగుపరుచుకొని ఏడో స్థానానికి చేరుకున్నాడు. అలాగే, హైదరాబాదీ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాకింగ్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హాజిల్‌వుడ్ 692 పాయింట్లతో టాప్‌ వన్‌లో నిలిచాడు. రెండో ప్లేస్‌లో మిచేల్‌ స్టార్క్‌, ట్రెంట్‌ బౌల్డర్‌ థర్డ్‌ ప్లేస్‌లో ఉన్నారు.

Latest News

More Articles