Friday, May 3, 2024

సముద్రం లోపల జాతీయ జెండా ఆవిష్కరణ.. వీడియో వైరల్

spot_img

77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారత కోస్ట్ గార్డ్ వినూత్నంగా వేడుకలను చేపట్టింది. తమిళనాడులోని రామేశ్వరం వద్ద ఉన్న బంగాళాఖాతంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నీటి అడుగున చేపట్టింది. సముద్ర గర్భానా మువ్వన్నెల జెండాను ఎగురవేసిన కోస్ట్ గార్డులు.. జాతీయ గీతాన్ని ఆలపించి, వందనం చేశారు.

నీటి అడుగుభాగానికి ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను భారత కోస్ట్ గార్డ్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest News

More Articles