Friday, May 17, 2024

ప్రయాణికులకు షాకిచ్చిన ఇండిగో!

spot_img

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తన ప్రయాణికులకు షాకిచ్చింది. విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచింది. వివిధ సేవలకు సంబంధించి ఛార్జీలకు తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. 232 సీట్లు ఉన్న ఎయిర్‌బస్‌ ఏ321 విమానంలో ముందు వరుస విండో సీటు కోసం రూ.2,000 అదనంగా చెల్లించాలి.

ఇది కూడా చదవండి: గ్రూప్‌-1లో మళ్లీ ఇంటర్వ్యూ?

ఇక మధ్య సీటు కోసం రూ. 1,500 వరకు చెల్లించాలి. అదే 222 సీట్లు కలిగిన ఏ321, 186 సీట్లు ఉన్న ఏ320, 180 సీట్లు ఉండే ఏ320 విమానాల్లో కూడా ఇవే ధరలు వర్తిస్తాయి. వీటితోపాటు ఏటీఆర్ విమానాల్లో సీట్లు కావాలంటే రూ.500 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఇండిగో వెల్లడించింది.

Latest News

More Articles