జీహెచ్ ఎంసీలో భారత రాష్ట్ర సమితి ఫ్లోర్ లీడర్ ను పార్టీ నియమించింది. మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ను ఫ్లోర్ లీడర్ గా నియమిస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ గా తనను నియమించినందుకు జగదీశ్వర్ గౌడ్ పార్టీ అధిష్టానానికి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన బాధ్యతను నెరవేరుస్తూ.. నగర ప్రజలకు అవసరమైన అంశాలను జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు జగదీశ్వర్ గౌడ్.