హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆసక్తిని పెంచిన ఆదిపురుష్ నుంచి తాజా అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి ‘జై శ్రీరామ్’ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
రామునిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రనౌత్ దర్శకత్వం వహించారు.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా కనిపించనున్నారు. దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను జూన్ 16న రిలీజ్ చేయనున్నారు. అజయ్-అతుల్ ద్వయం సంగీతం అందించారు.
జై శ్రీరామ్ సాంగ్ ప్రారంభంలో ‘ఎవరు ఎదురురాగలరు మీ దారికి.. ఎవరికుంది ఆ అధికారం.. పర్వత పాదాలు వణికి కదుల్తాయి మీ హూంకారానికి’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ తో పాట ప్రారంభమవుతుంది.