Tuesday, May 14, 2024

BREAKING : సినీపరిశ్రమలో మరో విషాదం.. ‘జైలర్’ నటుడు కన్నుమూత..!!

spot_img

చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. గత రెండు మూడేండ్ల నుంచి ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు మరణిస్తూనే ఉన్నారు. కోవిడ్ కారణంగా కొంతమంది మరణించారు. మరికొంతమంది అనారోగ్య సమస్యలతో మరణించారు. తాజాగా జైలర్ నటుడు మరణించారు. ప్రముఖ తమిళ డైరెక్టర్ జి మారి ముత్తు ఇవాళ ఉదయం గుండెపోటు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మారి ముత్త ఇప్పటివరకు వందకు పైగా సినిమాలు చేశారు. ఇయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తాజాగా విక్రమం, జైలర్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా జైలర్ మూవీలో విలన్ గా మారుముత్తు నటించారు. ఈ సినిమాలో ఆయన నటన ఎంతోమందిని ఆకట్టుకుంది. మారిముత్తు మృతికి సినిమా ప్రముఖులతోపాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

మరిముత్తు అజిత్ నటించి 1999 చిత్రం వాలిలో సహాయక పాత్రతో తన వృత్తిని ప్రారంభించాడు . కన్నుమ్ కన్నుమ్ (2008) తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు , ఇందులో ప్రసన్న ఉదయతార ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు కూడా రాశారు. ఆ తర్వాత యుద్ధం సే (2011), కోడి (2016), బైరవ (2017), కడైకుట్టి సింగం (2018), శివరంజినియుమ్ ఇన్నుమ్ సిల పెంగళం (2021) హిందీ చిత్రంతో సహా అనేక తమిళ చిత్రాలలో సహాయక పాత్రల్లో నటించాడు.

Latest News

More Articles