Sunday, May 12, 2024

దమ్ముంటే రండి.. బీజేపీ నేతలకు సవాల్ విసిరిన జీవన్ రెడ్డి

spot_img

నిజామాబాద్ జిల్లా: బీజేపీ అంటే జూట పార్టీ. చదువు రాని సంఘానికి అధ్యక్షులు మోడీ అయితే ఉపాధ్యక్షుడు కిషన్ రెడ్డి, కార్యదర్శులు బండి సంజయ్ ,అరవింద్ లు అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవ చేశారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, దేశాన్ని అప్పుల పాలు జేసింది బీజేపీ అంటూ నిప్పులుచెరిగారు.

14 మంది పీఎం లు చేసిన అప్పుల కంటే మోదీ ఒక్కరే చేసిన అప్పు ఎక్కువన్నారు. అప్పులు చేయటమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. మోదీ తన సన్నిహితుల ఆస్తులను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. కిషన్ రెడ్డి గోల్కొండ కోటపై గోల్ మాల్ మాటలు మాట్లాడుతున్నారు. ఫ్లై ఓవర్ల నిర్మాణం గురించి కిషన్ రెడ్డి బుద్ది లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నిర్మించిన ఫ్లై ఓవర్లు కిషన్ రెడ్డికి కనపడక పోవటం సిగ్గుచేటన్నారు.

కిషన్ రెడ్డి టూరిస్ట్ మంత్రి కాదు టూరిజం మంత్రి. ఇచ్చిన హామీలు కాకుండా చెప్పని పనులను కూడా చేసి చూపించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. కేసీఆర్  చావు నోట్లో తలకాయ పేట్టి తెలంగాణ సాధించారు. కేసీఆర్ కు ముందు కేసీఆర్ తర్వాత అన్నరకంగా ఈరోజు రాష్ట్రం లో అభివృద్ధి కనిపిస్తుంది. వైద్యం ,ఆరోగ్యం ,విద్య ,ఉపాధి రంగాల్లో తెలంగాణ ఎనలేని అభివృద్ధి సాధించింది. మా ప్రభుత్వం పేద ప్రజలను ఆడుకుంటే, మోదీ ప్రభుత్వం సామాన్యులను దోచుకుంటున్నదన్నారు.

బీజేపీ నేతలకు సవాల్.. దమ్ముంటే అప్పులపై చర్చకు రావాలి అని సవాల్ చేశారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి  చేసింది ఏంటో చెప్పాలి. కాంగ్రెస్స్ పార్టీ కరెప్షన్ పార్టీ. కాంగ్రెస్ నేతలకు రక్త పరీక్ష చేస్తే అవినీతి రక్తం అని రిపోర్టు వస్తది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుంది. బీజేపీ నేతలు వొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కేసీఆర్ కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.

Latest News

More Articles