Saturday, May 18, 2024

జ‌హీరాబాద్‌ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్‌.. బీఆర్ఎస్‌లోకి ఝ‌రాసంగం జ‌డ్పీటీసీ

spot_img

సంగారెడ్డి జిల్లా జ‌హీరాబాద్ నియోజక‌వ‌ర్గంలో బీఆర్ఎస్‌లోకి చేరిక‌లు కొన‌సాగుతున్నాయి. ఝ‌రాసంగం కాంగ్రెస్ జ‌డ్పీటీసీ స‌భ్యురాలు వినీల, న‌రేశ్ దంప‌తులు మంత్రి హ‌రీశ్‌రావు స‌మ‌క్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

జ‌హీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు వినీల న‌రేశ్ దంప‌తుల‌ను పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. వీరి చేరిక‌తో పార్టీ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని ఎమ్మెల్యే అన్నారు. వినీల న‌రేశ్ దంప‌తుల‌తో పాటు మ‌రి కొంత‌మంది కాంగ్రెస్ నాయ‌కులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Latest News

More Articles