Monday, May 13, 2024

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్‌..!

spot_img

జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణ‌న్‌ కు తెలంగాణ బాధ్యతలను అప్పగించారు. తెలంగాణతోపాటు పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా ఆయనే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తమిళిసై రాజీనామా చేసిన నేపథ్యంలో ఇవాళ రాష్ట్రపతి భవన్ నుంచి ఈ విషయాన్ని ఓ ప్రెస్ రిలీజ్ ద్వారా వెల్లడించింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పూర్తిస్థాయి గవర్నర్లను నియమించే వరకు తెలంగాణ, పుదుచ్చెరి బాధ్యతలు నిర్వర్తించాలని కోరుతూ రాష్ట్రపతి భవన్ ఓ లేఖను విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి నియామకం అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రెస్ నోట్లో పేర్కొంది.

ఇది కూడా చదవండి: గర్భిణీలకు రూ.11,000.. ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి తెలుసా?

Latest News

More Articles