Sunday, April 28, 2024

గర్భిణీలకు రూ.11,000.. ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి తెలుసా?

spot_img

ప్రధానమంత్రి మాతృద్వా వందన యోజన పథకం కింద పలు విడతల్లో గర్భిణులకు రూ.11 వేల ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ పథకం భారతదేశంలోని గర్భిణీలు, పాలిచ్చే తల్లులందరికీ వర్తిస్తుంది.2017లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి దరఖాస్తు చేయడం ద్వారా, గర్భం దాల్చినప్పటి నుండి పుట్టిన వరకు 3 వాయిదాలలో డబ్బు చెల్లిస్తుంది. అలాగే ఈ పథకం ద్వారా గర్భిణీలందరికీ ఉచిత మందులు, ప్రెగ్నెన్సీకి ముందు, ఆ తర్వాత పరీక్షలు చేయించుకోవడం వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తారు.

ఈ పథకాన్ని పొందేందుకు మీరు అధికారిక వెబ్‌సైట్ https://pmmvy.wcd.gov.inని సందర్శించాలి . తర్వాత సిటిజన్ లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేస్తు.. ఫారమ్ ఒపెన్ అవుతుంది. అవసరమైన సమాచారాన్ని అందులో నమోదు చేయండి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. ఆపై సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. మీ దరఖాస్తు ధృవీకరించిన తర్వాత ఆర్థిక సహాయం మీ బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేని వారు. ముందుగా అంగన్‌వాడీ కేంద్రాన్ని లేదా ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి. ప్రధాన్ మంత్రి మాతృత్వ వందన యోజన దరఖాస్తు ఫారమ్‌ను పూరించి..అవసరమైన పత్రాలను జత చేయండి. ఆ తర్వాత మీకు రసీదు జారీ ఇస్తారు. మీరు దానిని సురక్షితంగా దాచుకోవాలి. ఎందుకంటే డబ్బులు రాకపోతే ఈ రశీదుతో విచారించవచ్చు. గర్భిణీ ఆధార్ కార్డ్, పిల్లల జనన ధృవీకరణ పత్రం, చిరునామా సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, పాన్ కార్డ్, కొనుగోలు ఖాతా పుస్తకం, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకం నుండి ప్రయోజనం పొందేందుకు దరఖాస్తుదారు తప్పనిసరిగా భారత పౌరుడిగా ఉండాలి. గర్భిణీ స్త్రీలకు 19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి.

ఇది కూడా చదవండి: కరువుపై సర్కార్ మొద్దు నిద్ర..!

Latest News

More Articles