ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రేరా కార్యదర్శి శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టు ఫిబ్రవరి 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. బాలకృష్ణనను ఏసీబీ అధికారులు చంచల్గూడ జైలుకు తరలించారు. రెరా కార్యదర్శిగా, గతంలో హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన శివబాలకృష్ణను అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసింది. బుధవారం ఉదయం నుంచి శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. రూ.400 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించిన అధికారులు.. ఇంకా మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బినామీల పేరుతో వందల కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు అనుమానిస్తున్నారు.
Read also: ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశాలు