నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సంఘటన తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ ఘాట్ దెగ్గర తారక్ ఫ్లెక్సీలను తొలగించటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. వైసీపీ నాయకులు ఈ సందర్భంగా మండిపడ్డారు. బాలకృష్ణ ఆదేశాలతోనే ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసేశారని అన్నారు. నందమూరి అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు కూడా ఈ విషయంపై కౌంటర్లు ఇచ్చారు.
ఇక ఈ విషయంపై తాజాగా మాజీఎంపీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్… ఆకాశమంత ఎత్తులో ఉన్నారు, ఫ్లెక్సీలు తొలగిస్తే ఆయనకొచ్చే నష్టమేమీ లేదన్నారు. తారక్ స్థాయిని తగ్గించాలని ఎవరైనా అనుకుంటే ఆకాశంపై ఉమ్మివేసినట్టే అన్నారు యార్లగడ్డ. ఎవరైనా తారక్ని తిట్టినా, అగౌరవపరిచినా.. వాళ్లకే నష్టం అని చెప్పారు. అయితే ఈ కామెంట్స్ బాలక్రిష్ణని ఉద్దేశించి అన్నవే అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. ఎన్టీఆర్ ఘాట్ దెగ్గర ‘ఫ్లెక్సీలను తీసేయండి’ అని బాలయ్య ఆదేశించిన వీడియో ఒకటి వైరల్ అవుతుండటం గమనార్హం.