లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే మరో ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల,వరంగల్ పార్లమెంటు స్థానాల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు కేసీఆర్. చేవెళ్ల పార్లమెంటు స్థానానికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య ను అధినేత కేసీఆర్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లో చేరుతున్నానని వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదు