Friday, May 3, 2024

కాంగ్రెస్ లో చేరుతున్నానని వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదు

spot_img

స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఆయనకు కీలక పదవిని ఆఫర్ చేసిందని, దీంతో ఆ పార్టీలో చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో ఇవాళ( బుధవారం) మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లుగా వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తనపై కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పార్టీని ఎవరూ వీడటం లేదని… పార్టీని… పార్టీలోని ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామన్నారు కడియం. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీలోకి వెళుతున్నారంటూ ప్రచారం సాగింది. ఆయన అనూహ్యంగా హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసంలో ప్రత్యక్షమయ్యారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నా.. నన్నెవరు కిడ్నాప్‌ చేయలేదు

Latest News

More Articles