Tuesday, May 7, 2024

బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నా.. నన్నెవరు కిడ్నాప్‌ చేయలేదు

spot_img

తాను పార్టీ మారడం లేదని, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నాని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ వీడి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నిజం కాదన్నారు. నిన్న కేంద్ర మంత్రి అమిషాను కలువలేదన్నారు. నన్ను ఎవరూ బలవంతంగా తీసుకెళ్ల లేదు. నా వ్యక్తిగత పనిమీద హైదరాబాద్‌ వెళ్తున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు.

రమేష్ బీజేపీలో చేరాలని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు నానా హంగామా సృష్టించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో కూర్చున్న అరూరి రమేష్‌ను వాహనంలో నుంచి బీజేపీ కార్యకర్తలు బయటకు లాగారు. బీజేపీలో చేరాలని రమేష్‌ను ఆ పార్టీ కార్యకర్తలు దీనంగా వేడుకున్నారు. ఈ నేపథ్యంలో తాను మారడం లేదని ఆయన తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి: జూన్ నెల శ్రీ‌వారి ద‌ర్శ‌నం, ఆర్జిత‌సేవా టికెట్లు, శ్రీ‌వారి సేవ కోటా విడుద‌ల‌ తేదీ

 

 

 

Latest News

More Articles