Sunday, May 19, 2024

నేడు కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో గులాబీ బాస్ బస్సు యాత్ర..!

spot_img

లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. వరుస పర్యటనలతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు గులాబీ బాస్. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారంలో మరింత వేగం పెంచి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. అందులో భాగంగా నేడు కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పర్యటించనున్నారు కేసీఆర్.

పర్యటనలో భాగంగా ముందుగా సాయంత్రం 5గంటలకు కామారెడ్డిలోని జేపీ చౌక్ దగ్గర కార్నర్ మీటింగ్ లోపాల్గొంటారు. తర్వాత రాత్రి 8గంటలకు బీఆర్ఎస్ కంచుకోట మెదక్ లోని రాందాస్ కూడలిలో నిర్వహించనున్న రోడ్ షో లో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఏప్రిల్ 24న కేసీఆర్ బస్సు యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

ఇది కూడా చదవండి: బెంగళూరు మెట్రో రైల్ లో ముద్దులతో రెచ్చిపోయిన యువ జంట

Latest News

More Articles