Sunday, May 19, 2024

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్‌లు

spot_img

ఆన్‌లైన్ గేమ్‌లకు ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి బలయ్యాడు. గేమ్ లకు వ్యసన పరుడుగా మారి వచ్చే సారలరీ తో పాటు అప్పులు కూడా చేశాడు. అప్పులు ఎక్కువ కావడంతో ఇవాళ(మంగళవారం) ఆత్మహత్య చేసుకున్నాడు.

కరీంనగర్ జిల్లాలోని గంగాధర్‌లో జరిగింది. మధురానగర్‌లో నాగుల లక్ష్మణ్, లక్ష్మి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు తన కుమారుడు పృధ్వీని(25) బీటెక్ చేశాడు. పృధ్వీ హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇక్కడ చేస్తున్న కంపెనీ చెందని మరో బ్రాంచ్ ఉత్తర ప్రదేశ్‌లో ఉండడంతో అక్కడికి పృధ్వీని ట్రాన్స్ఫర్ చేశారు. నోయిడాలోని ఆ కంపెనీలో జాబ్ చేస్తూ ఓ రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.

ముగ్గురు స్నేహితులతో కలిసి గదిలో ఉండడంతో వారు ఆన్‌లైన్ గేమ్స్ ఎక్కువగా  ఆడతారు. వారితో పాటు పృధ్వి కూడా గేమ్స్ కు బానిసగా మారాడు. తనకు వచ్చే సాలరీ తో పాటు ఫ్రెండ్స్ దగ్గర రూ.12 లక్షలు అప్పులు చేసి ఆన్‌లైన్ గేములు ఆడడంతో డబ్బులన్నీ పొగొట్టుకున్నాడు. ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు పృధ్వి.  ఫ్రెండ్స్ సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని యుపీ నుంచి కరీంనగర్‌కు తరలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: బెంగళూరు మెట్రో రైల్ లో ముద్దులతో రెచ్చిపోయిన యువ జంట

Latest News

More Articles