Sunday, May 19, 2024

బెంగళూరు మెట్రో రైల్ లో ముద్దులతో రెచ్చిపోయిన యువ జంట

spot_img

ఎక్కడ ఉన్నామనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు కొంత మంది యువతీ యువకులు. చుట్టూ జనాలు ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా అసభ్య చేష్టలతో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది తమ బాయ్ ఫ్రెండ్స్ తో, గర్ల్ ఫ్రెండ్స్ తో గడిపేందుకు మెట్రో రైళ్లను ఎంచుకుంటున్నారు. అందరూ చూస్తున్నారనే ద్యాస కూడా లేకుండా ముద్దులతో, హగ్గులతో రెచ్చిపోతున్నారు. ఇది తోటి ప్రయాణికులకు ఎంతో ఇబ్బందిగా ఉన్నా పట్టించుకోవడం లేదు.
ఇలాంటివి కొంత కాలంగా క్రితం ఢిల్లీ మెట్రో రైల్ లో యువ జంటలు రెచ్చిపోవడం. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. అలాంటిదే ఇప్పుడు బెంగళూరులో మెట్రోలో జరిగింది. బెంగళూరు మెట్రో రైలులో ఓ యువ జంట అభ్యంతరకరంగా ప్రవర్తించారు. చుట్టూ జనం ఉన్నా పట్టించుకోకుండా కిస్సులు, హగ్గులతో మునిగిపోయారు. వీరి వ్యవహారాన్ని తోటి ప్రయాణికుడు తన ఫోన్ కెమెరాలో షూట్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. వీడియోపై పోలీసులు స్పందించారు. ఆ యువజంటను గుర్తించి, చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.

ఇది కూడా చదవండి:మోడీ..పదేండ్లలో తెలంగాణకు ఏం చేశారో చెప్పి ఓట్లడగండి

Latest News

More Articles