బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర అనుకున్న షెడ్యూల్ కంటే ఒ రోజు ఎక్కువ కొనసాగనుంది. కేసీఆర్ బస్సు యాత్ర చివరి రోజు మే 11వ తేదీన ఉదయం 10 గంటలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్డు షో నిర్వహించనున్నారు కేసీఆర్. దీంతో రోడ్ షోతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం 10వ తేదీన సిద్దిపేటలో బస్సు యాత్ర ముగియాల్సి ఉంది. బస్సు యాత్ర ముగింపు నేపథ్యంలో సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. సభ ఏర్పాట్లను ఇప్పటికే చేపట్టారు పార్టీ వర్గీయులు. అయితే మరో రోజు బస్సు యాత్రను పొడిగించింది బీఆర్ఎస్ పార్టీ. చివరి రోజున గజ్వేల్లో కేసీఆర్ పర్యటించనున్నారు.
ఇవాళ(మంగళవారం) సాయంత్రం 5 గంటలకు కామారెడ్డిలోని జేపీ చౌక్ దగ్గర కార్నర్ మీటింగ్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు బీఆర్ఎస్ మెదక్లోని రాందాస్ సెంటర్ లో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొంటారు.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఏప్రిల్ 24న కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్లు