లోక్సభ ఎన్నికలు సమీస్తున్న టైంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాకిచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. రైతు భరోసా డబ్బుల చెల్లింపులపై ఆంక్షలు విధించింది. మే 13వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాతనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సీఈసీ ఆదేశించింది. ఈ నెల 9వ తేదీలోగా రైతుభరోసా నిధులు జమ చేస్తామని పలు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడాన్ని కోడ్ ఉల్లంఘన కింద భావించిన ఎన్నికల సంఘం ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
పంట పెట్టుబడి కింద అన్నదాతలకు అందించే రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది. ఇప్పటివరకు ఐదు ఎకరాలలోపు ఉన్న వారికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. ఐదు ఎకరాలకు పైబడిన రైతులకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సుమారు రూ. 2వేల కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే.. సీఎం రేవంత్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో సీఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికలు ముగిసిన తర్వాతే రైతులకు నగదు అందజేయాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి నామినేషన్