హైదరాబాద్: నిజామాబాదు ఉగ్ర కుట్ర కోణం కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిఎఫ్ఐ కీలక నిందితుడు మోసం మహమ్మద్.. ఆంధ్రప్రదేశ్లో నివాసమంటూ కర్ణాటకకు మకాం మార్చాడని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఉగ్రవాద కుట్ర కోణం కేసులో తెలంగాణ పోలీసులు 16 మందిని అరెస్ట్ చేశారు.
పిఎఫ్ఐకి ఆయుధాల శిక్షకుడిగా మహమ్మద్ వ్యవహారిస్తున్నాడు. కర్ణాటకలో తప్పుడు పత్రాలతో మహమ్మద్ నివసిస్తున్నాడు. యువతని ఉగ్ర వాదం వైపు తీసుకువెళ్లి ఆయుధాల శిక్షణ ఇస్తున్నాడు. తెలంగాణ, ఆంధ్ర పిఎఫ్ ఐకు మహమ్మద్ ఇన్చార్జిగా పనిచేస్తున్నాడని పోలీసులు వివరించారు.