Monday, May 13, 2024

కేఎల్‌ రాహుల్‌ సూపర్‌ సెంచరీ.. ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌  

spot_img

సెంచురియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌ ముగిసింది. టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్‌ బ్యాటర్ కేఎల్ రాహుల్ 101(137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ 208/8 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించింది టీమిండియా. ఈ క్రమంలో రాహుల్‌ టెస్టు కెరీర్‌లో ఇది ఎనిమిదో శతకం నమోదు చేశాడు. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (38),  శ్రేయస్‌ అయ్యర్ (31), శార్దూల్ ఠాకూర్ (24) కాస్త ఫర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లు రబాడ 5, బర్గర్ 3.. జాన్‌సెన్‌, కోయిట్జీ చెరో వికెట్ తీశారు.

Latest News

More Articles