Sunday, April 28, 2024

ఆల్ప్రజోలం తయారీ ముఠా గుట్టురట్టు

spot_img

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఆల్ప్రజోలం తయారీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కులబ్ గుర్ లో ఆల్ప్రజోలం తయారీ ముడి పదార్థాలని నార్కోటిక్ అధికారులు, సంగారెడ్డి జిల్లా పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. కులబ్ గుర్ లో గుట్టుచప్పుడు కాకుండా ఆల్ప్రజోలం తయారీ చేస్తున్న కేటుగాళ్ళపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

నలుగురు నిందితులు కమల్, డేవిడ్, శివ, వినోద్ లను అదుపులోకి తీసుకున్నామని, పట్టుబడ్డ ఆల్ప్రజోలం ముడిపదార్థాల విలువ రూ.50 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. 2018లోనూ ఆల్ప్రజోలం అమ్ముతూ నిందితులు పట్టుబడ్డారని పోలీసులు చెప్పారు.

Latest News

More Articles