Monday, May 20, 2024

అంబులెన్స్ లో వచ్చి దుబ్బాక లో నామినేషన్‌ వేసిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

spot_img

దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అంబులెన్స్ లో వచ్చి నామినేషన్ వేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఆయన కత్తిపోటుకు గురైయ్యారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి అంబులెన్సులో ఆయన దుబ్బాకకు వచ్చారు. ఆయన సహాయకులు వీల్ ఛైర్ లో ఆయనను రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరకు తీసుకెళ్లారు. నామినేషన్‌ పత్రాలను ఆర్వో గరిమ అగర్వాల్‌కు సమర్పించారు కొత్త ప్రభాకర్ రెడ్డి.

అక్టోబర్ 30న దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డిలో ప్రచారం నిర్వహిస్తుండగా ఆయనపై గటాని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

ఇది కూడా చదవండి: సనత్ నగర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు

Latest News

More Articles