Friday, May 17, 2024

కోమటిరెడ్డిని చెప్పుతో కొట్టాలా ఓటుతో కొట్టాలా ?

spot_img

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అహంకారంతో నోరు జారారు. రైతు బంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టండి అంటూ రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. మీడియా సమక్షంలో ఇలా మాట్లాడటంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కేటీఆర్ సైతం ఘాటుగా స్పందించారు. రైతుబంధు అడిగే రైతులని చెప్పుతో కొట్టండి అన్న మంత్రి కోమటి రెడ్డిపై ఫైర్ అయ్యాడు. తెలంగాణలో రైతులని చెప్పులతో కొడతామంటున్న వారిని మనం ఓటుతో కొడదామంటూ పిలునిచ్చాడు. నేడు కరీంనగర్ నియోజకవర్గంలో 2000మంది యూట్యూబ్ వారియర్స్ తో సమావేశమయ్యారు కేటీఆర్.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కంటే మనకి 14సీట్లు మాత్రమే తక్కువొచ్చాయి. కార్యకర్తలు ఢీలా పడిపోవాల్సిన అవసరం లేదని ధైర్యం చేప్పారు. రేవంత్‌రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కానీ, ఇవాళేంటి పరిస్థితి? అని ప్రశ్నించారు. కరెంట్ బిల్లులు కట్టొద్దని సోనియా కడుతుందని రేవంతే అన్నారు, బిల్లులు కట్టొద్దని మంత్రి వెంకట్ రెడ్డి అన్నరని గుర్తుచేశారు. కానీ ఇప్పటివరకు ఈ పథకం అమలుపై పల్లెత్తు మాట మాట్లాడటం లేదు కాంగ్రెస్. ఇక రైతుబంధు పడలేదంటే మంత్రి ​కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పుతో కొడతానన్నాడు. మరి రైతుబంధు రాని రైతులు ఇప్పుడు ఆలోచించాలి. వారిని చెప్పుతోని కొట్టాలా? లేదా ఓటుతోని కొట్టాలా అనేది ఆలోచన చేయాలన్నారు.

Latest News

More Articles