హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి మృతి పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు,హరీశ్ రావు తన సంతాపాన్ని ప్రకటించారు. సంపత్ రెడ్డి మరణం బాధాకరనమన్న కేటీఆర్, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెయజేశారు. బిఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందన్న కేటీఆర్, సంపత్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.