Friday, May 17, 2024

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు కేటీఆర్ భరోసా

spot_img

హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు తెల్లారి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులతో హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ప్రత్యేకంగా సమావేశం అవుతానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే తారక రామారావు తెలిపారు.  అశోక్ నగర్ తో పాటు పలు యూనివర్సిటీలలో ఉద్యోగాలకు సిద్ధమవుతున్న కొంతమంది విద్యార్థులు కేటీఆర్ ని కలిశారు. ఆ తర్వాత ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన పలు అంశాలపైన మంత్రి కేటీఆర్ తో విస్తృతంగా సంభాషించారు.

Also Read.. హింసను ప్రేరేపించేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. సీఈఓకు బీఆర్ఎస్ ఫిర్యాదు

ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ఉన్న అన్ని సమస్యల పైన కూలంకషంగా చర్చించేందుకు ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లారి నాల్గవ తేదీన 10 గంటలకి అశోక్ నగర్ లో ప్రభుత్వ ఉద్యోగార్డులతో సమావేశం అవుతానని వారికి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తమ నిబద్ధతను ఎవరు ప్రశ్నించే అవకాశం లేదని… ముఖ్యంగా సంవత్సరానికి 1000 ఉద్యోగాలు కూడా కల్పించని కాంగ్రెస్ పార్టీకి అసలే లేదన్నారు. తాము రాష్ట్ర యువకులకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి రెట్టింపుకు పైగా 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇందులో ఇప్పటికే 1,62,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు.

Also Read.. సన్నాసుల, వెదవల చేతుల్లో పెడదామా ఈ రాష్ట్రాన్ని? తీవ్రంగా విరుచుకుపడ్డ కేటీఆర్

దేశంలో తెలంగాణ కన్న ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలను గత పది సంవత్సరాల లో భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది లేదన్నారు. తమపై కేవలం రాజకీయ దురుద్దేశంత ఉంచుకొని విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయంలో రాష్ట్ర యువకులకు సమాధానం చెప్పాలన్నారు. తాము అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా పది సంవత్సరాలలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలను ఇస్తే ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు యువకులకు గణాంకాలతో సహా వివరించాలని సవాలు చేశారు. రాష్ట్ర యువకులు విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయాల కోసం ఈ అంశం పైన చేస్తున్న అసత్య పూరిత ప్రాపగాండాను తిప్పికొట్టి నిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల తాలూకు వివరాల జాబితాను, ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాల ప్రక్రియ తాలూకు వివరాలను గణాంకాలతో సహా అందించారు.

Also Read.. నల్గొండ దత్తత పూర్తికాలే.. రాబోయే రోజుల్లో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తా

మంత్రి కేటీఆర్ తమతో ఈ అంశం పైన విస్తృతంగా సంభాషించడం తమకు సంతోషాన్ని కలిగించిందని  మంత్రితో సమావేశమైన ప్రభుత్వ ఉద్యోగార్థులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను పెద్ద ఎత్తున ఇచ్చినప్పటికీ నియామక ప్రక్రియకు సంబంధించిన కొన్ని సమస్యల వలన యువతలో కొంత ఆందోళన నెలకొందని వారు తెలిపారు. ఈ అంశాల పైన మంత్రి కేటీఆర్ తో తమ అభిప్రాయాలను సూచనలను పంచుకున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. పోస్టుల భర్తీ ప్రక్రియ మరియు రోస్టర్ పాయింట్ల కేటాయింపు, విద్య అర్హతల విషయంలో ఉన్న కొన్ని సమస్యలను సులభంగా పరిష్కరించే అవకాశం ఉందని ఇందుకు సంబంధించిన కొన్ని సలహాలు, సూచనలను అందించారు. కేవలం ఈ సాంకేతికపరమైన అంశాల ఆధారంగా అనేక న్యాయపరమైన కేసులు ఎదురవుతున్నాయని, వీటి వలన భర్తీ ప్రక్రియ కు ఆటంకం కలుగుతుందని తెలిపారు.

Also Read.. రంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఆడిటోరియం కూలి ఇద్దరు మృతి

విద్యార్థులు చెప్పిన సలహాలు సూచనలను పూర్తి సానుకూల దృక్పథంతో ముందుకు తీసుకెళ్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ఒకవైపు తాము కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాల కల్పన పట్ల సంతృప్తి గానే ఉన్న మరిన్ని ఉద్యోగాలు పెంచాలన్న విద్యార్థుల సూచన మేరకు గ్రూప్-2 ఉద్యోగాలను పెంచి వెంటనే నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తామని తెలిపారు. దీంతోపాటు కచ్చితంగా అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరు విషయంలో విద్యార్థుల ఆకాంక్షలకు అనుకూలంగా పూర్తిగా ప్రక్షాళన కూడా చేసే కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకు వెళ్తామని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న సుమారు 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామన్నారు. వివిధ నోటిఫికేషన్లు మరియు భర్తీ ప్రక్రియ పై ఉన్న కోర్టు కేసుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read.. ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించిన కుటుంబంపై యువకుడు కాల్పులు.. ఇద్దరు మృతి

ఒక యువకుడిగా దాదాపు దశాబ్ద కాలం పాటు ప్రైవేట్ రంగంలో ఒక ఉద్యోగ పని చేసిన అనుభవం తనకు ఉన్నదని, అది ప్రభుత్వ ఉద్యోగమైన, ప్రైవేట్ ఉద్యోగమైన దాన్ని సాధించేందుకు తర్వాత దాని నిర్వర్తించేందుకు ఎదురయ్యే సవాళ్లు సమస్యలను కచ్చితంగా తాను అర్థం చేసుకోగలుగుతానని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో విద్యార్థులకు, యువకులకు ఒక సోదరుడిగా భరోసా ఇస్తున్నానని తెలిపారు. ఎన్నికలు ముగిసిన తెల్లారే యువకులతో హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు అందరితో ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వారి సలహాలు సూచనలు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పైన యువకుల ఆకాంక్షలకు అనుగుణమైన ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

Latest News

More Articles