Saturday, May 18, 2024

కాంగ్రెస్ హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటోంది

spot_img

రాజకీయ దురుద్దేశంతో  కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ తో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గోన్నారు.

సమావేశంలో మాట్లాడిన కేటీఆర్…60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయోమయంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు ఇచ్చిన, 420 హామీలకు అమలుకు 57 వేల కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయించింది. మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా సోదరీమణులకు ఇవ్వాల్సిన మొత్తమే 50వేల కోట్ల పైన అవుతుంది. మరి రైతుబంధు, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల అమలకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారో బడ్జెట్లో చెప్పలేదు. ఫార్మసిటీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడంతో రాష్ట్ర అభివృద్ధి కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అభివృద్ధి దెబ్బతింటే, రాష్ట్రానికి రాబడి, రెవెన్యూ తగ్గే ప్రమాదం ఉంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపైన దృష్టి పెట్టకుండా, కేవలం ప్రజలను తప్పు దోవ పట్టించే అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలను ప్రజలు ఎక్కువ రోజులు నమ్మరని అన్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి.. రాజకీయ కారణాలతో అవకాశం రాకున్నా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశారు. ప్రతి ఒక్క కార్పొరేటర్, పార్టీ శ్రేణులు చేసిన కృషి వల్లనే ఈరోజు హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగలిగిందన్నారు. గత పదేండ్లలో ప్రతిరోజు పార్టీ కార్పొరేటర్లు ప్రజల్లో నిలబడి మరీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా చూశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్ధేశాలతో నగర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. జీహెచ్ ఎంసీ పాలకవర్గం బాధ్యతలను నిర్వహించడంలో ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రజా పాలన అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం జరగకుండా, స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు కాకుండా ఆపుతోందన్నారు. రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఐదు అంచెల పరిపాలన వ్యవస్థలో భాగంగా ఏర్పాటైన స్థానిక ప్రభుత్వం జీహెచ్ఎంసీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఉన్న విస్తృత అధికారాలను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను ఎదుర్కొనే ప్రయత్నం చేయాలన్నారు. జీహెచ్ఎంసీ పాలకమండలి, ప్రజలచేత ఎన్నికైన కార్పొరేటర్లు తమకున్న అధికారులను ఉపయోగించుకోవాలన్నారు కేటీఆర్.

అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం ఆ పార్టీకి అసాధ్యమన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. అధికారంలో ఉన్న..  లేకున్నా తమ తమ డివిజన్లో ప్రజలతో కలిసి పని చేద్దామన్నారు. పదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా నగరాన్ని అభివృద్ధి చేసింది. అన్ని రంగాల్లో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించింది.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పాలన పైన ప్రజల అసంతృప్తి నెలకొంది. పార్టీ కార్పొరేటర్ల వెంట, జీహెచ్ఎంసీ పార్టీ శ్రేణుల వెంట మొత్తం పార్టీ నిలబడుతుందన్నారు. అధికారులు, ప్రభుత్వం ఒత్తిడికిలోనై గతంలో ఇచ్చిన నిధులను, పనులు చేయడం లేదని తెలిపారు. ఈ కక్షపూరిత విధానంపైన ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అయినా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మన ప్రజలకు డివిజన్లో అవసరమైన కార్యక్రమాలు అమలు అయ్యేలా చేద్దామన్నారు తలసాని.

జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశాన్ని హైదరాబాద్ ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అజెండా కోసం నిర్వహిస్తామని తెలిపారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు అధికారులు ప్రజాప్రతినిధులకు సహకరించడం లేదన్నారు. అధికారుల ఒత్తిడిని, వారి పరిమితులను అర్థం చేసుకోగలుగుతాం కానీ… ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి నగర అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు.ఒక సాధారణ కార్పొరేటర్ గా ఉన్న నన్ను,  మేయర్ గా అవకాశం ఇచ్చి గొప్ప గౌరవమిచ్చిన పార్టీకి జీవితాంతం నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు మేయర్.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చుతుందే కానీ ప్రగతి గేర్లను మార్చడం లేదు

Latest News

More Articles