Friday, May 17, 2024

తెలంగాణను మరోసారి ఎడారిగా మార్చేలా కాంగ్రెస్ యత్నిస్తోంది

spot_img

తెలంగాణను మరోసారి ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.కాళేశ్వరం ప్రాజెక్టుపై బాధ్యత మరచి కాంగ్రెస్‌ ప్రభుత్వం దుష్ట రాజకీయాలు చేస్తోందన్నారు. ప్రజలకు కాళేశ్వరం గొప్పదనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూడటానికి, ఎండాకాలంలో ప్రజలు గొంతులు ఎండగా చూడటానికే తాము చలో మేడిగడ్డ పర్యటన చేపట్టామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ చలో మెడిగడ్డ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. తమ మీద కోపాన్ని రైతుల మీద చూపించొద్దన్నారు.

ఎండుతున్న పంటలకు తక్షణమే నీరందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు కేటీఆర్. రైతు ప్రయోజనం కాదు, రాజకీయ ప్రయోజనమే కాంగ్రెక్‌ కావాలని విమర్శించారు. నేడు తాము చేస్తున్న పర్యటన తర్వాత అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తామన్నారు. మరమ్మతులు చేయడానికి ఎందుకు ఇబ్బంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోండి. కానీ, రైతులను బలి చేయొద్దని సూచించారు. రిపేర్‌ చేయకుంటే వర్షాకాలంలో బరేజ్‌ కొట్టుకుపోతుందని చూస్తున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి:ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు.. మేడిగడ్డకు బయలుదేరిన బీఆర్ఎస్ బృందం.!

Latest News

More Articles