బీఆర్ఎస్ ఛలో నల్గొండ పిలుపునివ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే కేటీఆర్. తమ పార్టీ ఒత్తిడి కారణంగానే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించట్లేదని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెడుతోందన్నారు. ఇది ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్కు దక్కిన మొదటి విజయంగా భావిస్తున్నామంటూ కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఛలో నల్గొండ ఎఫెక్ట్!
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడానికి నిరసనగా రేపు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్గొండ' సభ సృష్టించిన ఒత్తిడి వల్ల.. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించట్లేమని నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
It’s… pic.twitter.com/0ysa6aUqFC
— KTR (@KTRBRS) February 12, 2024