కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో నిత్యం బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో తప్పించుకుంటే శాసనమండలిలో ప్రశ్నిస్తామని హెచ్చరించారు. నేడు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని కేటీఆర్ కలిశారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. శాసనమండలి సభ్యులు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలని సూచించారు.
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందన్నారు. ఈ పోటీలో మనకే ఎడ్జ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది అంతా వరుసగా వివిధ ఎన్నికలు ఉండనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు అంతా సంసిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. త్వరలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుందని అన్నారు. ఆ భేటీలోనే శాసన మండలి పార్టీ నేతలను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు.