Saturday, May 18, 2024

బీజేపీ, కాంగ్రెస్ లపై కేటీఆర్‌ మరోసారి సెటైర్లు..!!

spot_img

హైదరాబాద్‌: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి కేటీఆర్‌ మరోసారి సెటైర్లు వేశారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్‌ పరిపాలించే రాష్ట్రాల్లోనే విద్యుత్‌ లోటు అధికంగా ఉందని విమర్శలు గుప్పించారు.

Read Also.. రైలు ప్రయాణికులకు అలెర్ట్. తెలంగాణ, ఏపీలో పలు కీలక రైళ్లు రద్దు

2013-14లో విద్యుత్‌ లోటుతో ఉన్న తెలంగాణ ఇప్పుడు మిగులు రాష్ట్రమని గుర్తుచేశారు. తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్న కేటీఆర్.. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్లు తన ట్వీట్ లో వెల్లడించారు. అందుకే తెలంగాణ అభివృద్ధి మోడల్‌ దేశానికే ఉత్తమ నమూనా అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

Latest News

More Articles