హైదరాబాద్: బీహార్ కు చెందిన 7నెలల గర్భిణీని హత్య చేసిన కేసులో కూకట్ పల్లి కోర్టు తీర్పు వెలువరించింది. మొత్తం నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. కేసు వివరాల్లోకి వెళితే.. బీహార్ కు చెందిన పింకీ అనే మహిళను నిందితులు దారుణంగా హత్య చేశారు. అనంతరం ముక్కలుగా చేసి గోనసంచిలో కట్టి బొటానికల్ గార్డెన్ ముందు పడేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసింది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.